మే నెలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశం: ఉమర్ జలీల్
ABN , First Publish Date - 2021-01-21T21:41:07+05:30 IST
మే నెలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. 70శాతం సిలబస్ నుంచే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు.
హైదరాబాద్: మే నెలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ తెలిపారు. 70శాతం సిలబస్ నుంచే పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. 30శాతం ప్రాజెక్ట్ రూపంలో అసైన్మెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఎగ్జామ్ ఫీజ్ కట్టి పరీక్షలు రాయవచ్చని సూచించారు. జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు ఆందోళన అవరసరం లేదన్నారు. నిర్ధారించిన సిలబస్ మొత్తం పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తామని ఉమర్ జలీల్ తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఫెయిలైన విద్యార్థులను.. ప్రమోట్ చేసే అంశం ప్రభుత్వ పరిధిలో ఉందని ఉమర్ జలీల్ పేర్కొన్నారు.