14 వరకు ఇంటర్ మూల్యాంకనం నిలిపివేత
ABN , First Publish Date - 2020-04-03T06:55:22+05:30 IST
ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఈనెల 14వ తేదీ వరకు నిలిపివేశారు. నగరంలోని కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రగతి మహావిద్యాలయ్, మహబూబియా కళాశాల...
బర్కత్పుర, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని ఈనెల 14వ తేదీ వరకు నిలిపివేశారు. నగరంలోని కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రగతి మహావిద్యాలయ్, మహబూబియా కళాశాల, నాంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల, కస్బూర్బా కళాశాలలో మూల్యాంకనం సెంటర్లను ఏర్పాటు చేశారు. ఏ తేదీన మూల్యాంకనం ప్రారంభమవుతుందో అధికారులు ఈనెల 14లోపు ప్రకటించనున్నారు. అయితే మూల్యాంకనాన్ని నిలిపివేయడంపై అధ్యాపకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.