యూఏఈలోని భారతీయులకు గుడ్న్యూస్..!
ABN , First Publish Date - 2020-08-02T15:47:53+05:30 IST
దుబాయిలోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అక్కడి ప్రవాసులకు తీపి కబురు అందించింది.
రెండు రోజుల్లో పాస్పోర్టులను రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు
యూఏఈ: దుబాయిలోని కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా అక్కడి ప్రవాసులకు తీపి కబురు అందించింది. ఇకపై కేవలం రెండు రోజుల్లోనే పాస్పోర్టులను రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఇటీవల కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కాన్సుల్ జనరల్ డా. అమన్ పూరీ వెల్లడించారు. అలాగే యూఏఈ వ్యాప్తంగా ఉంటున్న ప్రవాసుల పాస్పోర్టు దరఖాస్తులను కూడా దుబాయిలోని ఇండియన్ కాన్సులేట్ స్వీకరిస్తుందని ప్రకటించారు. దుబాయితో పాటు నార్తన్ ఎమిరేట్స్లోని అన్ని బీఎస్ఎల్ కేంద్రాల్లో ప్రవాసుల నుంచి పాస్పోర్టు దరఖాస్తులు స్వీకరించబడతాయని తెలిపారు. దఖాస్తు అందిన తరువాతి రోజు నుంచే 95 శాతం పాస్పోర్టు దరఖాస్తులు ప్రాసెస్ చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గతేడాది దుబాయిలోని కాన్సులేట్ ప్రవాసులకు ఏకంగా 2 లక్షల పాస్పోర్టులు జారీ చేసిన విషయాన్ని అమన్ పూరీ గుర్తు చేశారు.