UK లో దారుణం.. 89 ఏళ్ల వయసున్న నాయనమ్మను దారుణంగా చంపేసిన భారత సంతతి వ్యక్తి.. పోలీసులు వచ్చే దాకా..

ABN , First Publish Date - 2022-06-25T02:18:20+05:30 IST

లండన్‌లోని(UK) ఓ భారత సంతతి వ్యక్తిపై హత్యా నేరం కింద పోలీసు కేసు నమోదైంది. వేరుషన్ మనోహరన్‌ అనే యువకుడు తన నాయనమ్మను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

UK లో దారుణం.. 89 ఏళ్ల వయసున్న నాయనమ్మను దారుణంగా చంపేసిన భారత సంతతి వ్యక్తి.. పోలీసులు వచ్చే దాకా..

ఎన్నారై డెస్క్: లండన్‌లోని(UK) ఓ భారత సంతతి వ్యక్తిపై హత్యా నేరం కింద పోలీసు కేసు నమోదైంది. వేరుషన్ మనోహరన్‌ అనే యువకుడు తన నాయనమ్మను హత్య చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ దారుణం జరగ్గా పోలీసుల తాజాగా నిందితుడుపై హత్యా నేరం కింద కేసు దాఖలు చేశారు. ‘‘అసలు ఏం జరిగిందనే తెలుసుకునేందుకు దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిస్తే తమను సంప్రదించాలని సూచించారు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక అంబులెన్స్ సర్వీసు సిబ్బంది మంగళవారం ఓ వృద్ధురాలు(89) కత్తిపోట్లతో కుప్పకూలిన విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడే ఉన్న మనోహరన్‌ను అరెస్టు చేశారు. ఈ దారుణం గురించి వృద్ధురాలి బంధువులకు సమాచారం అందించినట్టు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక ఆధారంగా తగు చర్యలు తీసుకుంటామన్నారు. 

Updated Date - 2022-06-25T02:18:20+05:30 IST