కొవిడ్ ఎఫెక్ట్.. విదేశాల్లోని భారతీయుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే..

ABN , First Publish Date - 2021-12-18T17:21:36+05:30 IST

విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం భారత ప్రభుత్వం చేసిన ఖర్చుకు సంబంధించిన సమాచారంపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కొ

కొవిడ్ ఎఫెక్ట్.. విదేశాల్లోని భారతీయుల కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందంటే..

ఎన్నారై డెస్క్: విదేశాల్లో ఉన్న భారతీయుల కోసం భారత ప్రభుత్వం చేసిన ఖర్చుకు సంబంధించిన సమాచారంపై కేంద్ర మంత్రి కీలక ప్రకటన చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్-19 మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఈ క్రమంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల కోసం ప్రభుత్వం ఎంత మేరకు ఖర్చు చేసిందనే వివరాలను శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 


లోక్‌సభ సభ్యులు అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ స్పందించారు. కరోనా నేపథ్యంలో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు సహాయం చేసేందుకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ నుంచి రూ.44కోట్లను భారత ప్రభుత్వం ఖర్చు చేసిందని శుక్రవారం రోజు రాత పూర్వక సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా 1.35 మంది భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా వేరు వేరు దేశాల్లో నివసిస్తున్నట్టు భావిస్తుందని ఆయన తెలిపారు. ఇందులో 88లక్షల మంది కేవలం గల్ఫ్ దేశాల్లోనే ఉన్నట్టు చెప్పారు. 



Updated Date - 2021-12-18T17:21:36+05:30 IST