Abu Dhabi Big Ticket లో భారతీయుడికి జాక్పాట్.. రూ. 23.84కోట్లు గెలిచిన Ras Al Khaimah వాసి!
ABN , First Publish Date - 2021-09-04T13:56:19+05:30 IST
అబుధాబి బిగ్ టికెట్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఓ భారతీయుడు జాక్పాట్ కొట్టాడు. రాస్ అల్ ఖైమాలో ఉండే భారత ప్రవాసుడు అబు మహమ్మద్ ఏకంగా 12 మిలియన్ దిర్హమ్స్(రూ.23.84కోట్లు) గెలుచుకున్నాడు. శుక్రవారం తీసిన బిగ్ టికెట్ డ్రాలో మహమ్మద్కు ఈ జాక్పాట్ తగిలింది. ఆగస్టు 30న నలుగురు తోటి వాళ్లతో కలిసి అతను కొన్న లాటరీ టికెట్ ఇలా వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.
రాస్ అల్ ఖైమా: అబుధాబి బిగ్ టికెట్ డ్యూటీ ఫ్రీ రాఫెల్లో ఓ భారతీయుడు జాక్పాట్ కొట్టాడు. రాస్ అల్ ఖైమాలో ఉండే భారత ప్రవాసుడు అబు మహమ్మద్ ఏకంగా 12 మిలియన్ దిర్హమ్స్(రూ.23.84కోట్లు) గెలుచుకున్నాడు. శుక్రవారం తీసిన బిగ్ టికెట్ డ్రాలో మహమ్మద్కు ఈ జాక్పాట్ తగిలింది. ఆగస్టు 30న నలుగురు తోటి వాళ్లతో కలిసి అతను కొన్న లాటరీ టికెట్ ఇలా వారికి అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. దీంతో వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. ప్రతినెల 3వ తేదీన నిర్వహించే బిగ్ టికెట్ డ్రాలో మహమ్మద్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం. 027700కు ఈ సారి జాక్పాట్ తగిలింది.
డ్రా అనంతరం విజేతగా నిలిచిన మహమ్మద్కు హోస్ట్ రిచర్డ్ ఫోన్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. దాంతో మహమ్మద్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. భార్య, తల్లి, ఇద్దరు కుమార్తెలతో కలిసి రాస్ అల్ ఖైమాలో నివాసముండే అతను.. ఓ షిప్పింగ్ కంపెనీలో ఆపరేషన్స్ కోఆర్డినేటర్గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆగస్టు 30న తనతో పాటు అదే కంపెనీలో పని చేసే నలుగురు మిత్రులతో కలిసి మహమ్మద్ అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్లో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. గత ఏడాది కాలంగా ఈ ఐదుగురు ఇలా కలిసి బిగ్ టికెట్ లాటరీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ శుక్రవారం నిర్వహించిన డ్రాలో మహమ్మద్ కొనుగోలు చేసిన లాటరీ టికెట్ నెం. 027700కు జాక్పాట్ తగిలింది. దాంతో ఏకంగా 12 మిలియన్ దిర్హమ్స్(రూ.23.84కోట్లు) గెలుచుకున్నారు. ఈ ప్రైజ్మనీని అందరం సమానంగా పంచుకుంటామని ఈ సందర్భంగా మహమ్మద్ చెప్పాడు.