భారతీయ వైద్య దంపతులకు గోల్డెన్ వీసా!
ABN , First Publish Date - 2021-08-01T13:21:22+05:30 IST
భారతీయ వైద్య దంపతులకు యూఏఈ సర్కార్ 10 ఏళ్ల పరిమితితో గోల్డెన్ వీసా మంజూరు చేసింది. యూఏఈ రాజధాని అబుధాబిలో నివాసముండే భారత్కు చెందిన డా. ధృవ్ గుప్తా, డా. దీపాలి గుప్తా దంపతులు తాజాగా గోల్డెన్ వీసా అందుకున్నారు.
అబుధాబి: భారతీయ వైద్య దంపతులకు యూఏఈ సర్కార్ 10 ఏళ్ల పరిమితితో గోల్డెన్ వీసా మంజూరు చేసింది. యూఏఈ రాజధాని అబుధాబిలో నివాసముండే భారత్కు చెందిన డా. ధృవ్ గుప్తా, డా. దీపాలి గుప్తా దంపతులు తాజాగా గోల్డెన్ వీసా అందుకున్నారు. 17 ఏళ్లకు పైగా వైద్యవృత్తిలో కొనసాగుతున్న గుప్తా దంపతులు దశాబ్దానికి పైగా అబుధాబి, అల్ ఐన్లో వైద్య సేవలు అందించారు. వారి సేవకు గుర్తింపుగా తాజాగా యూఏఈ ప్రభుత్వం వారికి వైద్య విభాగంలో గోల్డెన్ వీసా ఇచ్చింది. ఇక గోల్డెన్ వీసా పొందడం పట్ల గుప్తా దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.
కుమార్తెలు పరిణీత, ప్రియాన్షిలతో పాటు డిపెండెంట్లకు వీసా ప్రయోజనకరంగా ఉంటుందని దీపాలి గుప్తా అన్నారు. బుర్జీల్ డే సర్జరీ సెంటర్లో దీపాలి అనస్థీషియా స్పెషలిస్ట్గా పని చేస్తుంటే.. అలియా హాస్పిటల్లో డాక్టర్ ధృవ్ గుప్తా డెర్మటాలజిస్ట్ స్పెషలిస్ట్గా పని చేస్తున్నారు. కరోనా సమయంలో రోగులకు తాము అందించిన సేవలు తమకు మంచి గుర్తింపును తెచ్చాయని గుప్తా దంపతులు అన్నారు. ఇది కూడా తమకు గోల్డెన్ వీసా రావడానికి ఓ కారణంగా వారు పేర్కొన్నారు.