టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
ABN , First Publish Date - 2020-12-02T14:53:04+05:30 IST
మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడి మనుకా ఓవల్, కాన్బెర్రా క్రికెట్ స్టేడియం వేదికగా చివరి వన్డేలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్లు ...
ఓవల్: మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇక్కడి మనుకా ఓవల్, కాన్బెర్రా క్రికెట్ స్టేడియం వేదికగా చివరి వన్డేలో ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా జట్టు సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత రెండు వన్డే మ్యాచ్ల్లో భారత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన భారత్ జట్టు.. ఈ మ్యాచ్ నైనా గెలవాలని కసితో ఉంది. మరోవైపు ఆసీస్ జట్టు సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. అయితే.. చివరి వన్డేలో మాత్రం భారత్ జట్టు భారీగా మార్పులు చేసింది. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ప్లేస్లో శుభమన్ గిల్ రాగా... పేసర్ సైని, షమీ, చాహల్ స్థానాల్లో నటరాజన్, శార్ధూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్ను జట్టులోకి తీసుకున్నారు. ఈ వన్డేతో పేసర్ నటరాజన్ అంతర్జాతీయ క్రికెట్లో అరంగ్రేటం చేస్తున్నాడు.
జట్ల వివరాలు
ఇండియా: శిఖర్ ధావన్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, టి నటరాజన్
ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్ (కెప్టెన్), లబుషేన్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్ వెల్, హెన్రిక్స్, అలెక్స్ కేరీ, కామెరన్ గ్రీన్, అస్టన్ అగర్, సీన్ అబాట్, ఆడమ్ జంపా, హాజిల్వుడ్