అర్జెంటీనాపై భారత్‌ గెలుపు

ABN , First Publish Date - 2021-04-13T09:21:25+05:30 IST

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో ఆతిథ్య అర్జెంటీనాపై భారత్‌ 3-0తో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది...

అర్జెంటీనాపై భారత్‌ గెలుపు

బ్యూన్‌సఎయిర్స్‌: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో ఆతిథ్య అర్జెంటీనాపై భారత్‌ 3-0తో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో భారత్‌ నాలుగో స్థానానికి ఎగబాకింది. బెల్జియం, జర్మనీ, నెదర్లాండ్స్‌ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ (11వ నిమిషంలో), లలిత్‌ (25వ ని.), మన్‌దీప్‌ (58వ ని.) గోల్స్‌ చేసి అర్జెంటీనాపై తిరుగులేని విజయాన్ని అందించారు. భారత్‌ తన తదుపరి మ్యాచ్‌ను ఇంగ్లండ్‌తో వచ్చే నెల 8న లండన్‌లో ఆడనుంది.

Updated Date - 2021-04-13T09:21:25+05:30 IST