India vs Ireland : వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యం.. Umran malik అరంగేట్రం
ABN , First Publish Date - 2022-06-27T03:26:56+05:30 IST
ఇండియా వర్సెస్ ఐర్లాండ్(India vs Ireland) తొలి టీ20 మ్యాచ్కు వర్షం ఆటంకంగా మారింది. డబ్లిన్ వేదికగా మొదలవ్వాల్సిన
డబ్లిన్ : ఇండియా వర్సెస్ ఐర్లాండ్(India vs Ireland) టీ20 సిరీస్లో తొలి మ్యాచ్కు వర్షం అంతరాయంగా మారింది. డబ్లిన్ వేదికగా 9 గంటలకు(భారత కాలమానం ప్రకారం..) మొదలవ్వాల్సిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యమైంది. మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో వర్షం మరింత జోరందుకుంది. దీంతో మరింతసేపు నిరీక్షణ తప్పదు. 2 మ్యాచ్ల సిరీస్లో తొలి మ్యాచ్కు డబ్లిన్లోని మలహిడే క్రికెట్ క్లబ్ వేదికైంది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. హార్ధిక్ పాండ్యా తొలిసారి ఈ సిరీస్లో కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.
స్వదేశంలో దక్షిణాఫ్రికాపై టీ20 సిరీస్లో చోటులభించని పేసర్ ఉమ్రాన్ మాలిక్(Umran malik)కు ఐర్లాండ్(Irland)పై తొలి మ్యాచ్లో తుది జట్టులో చోటు దక్కింది. వైస్ కెప్టెన్ భువనేశ్వర్(Bhuvaneswar kumar) నుంచి ఉమ్రాన్ మాలిక్ క్యాప్ అందుకున్నాడు. మరోవైపు ఐర్లాండ్ పేసర్ కొనోర్ ఒల్ఫెర్ట్ కూడా ఈ మ్యాచ్లో అరంగేట్రం చేశాడు.
తుది జట్లు..
భారత్ : రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), దినేష్ కార్తీక్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, యజువేంద్ర చాహాల్, ఉమ్రాన్ మాలిక్.
ఐర్లాండ్ : పాల్ స్టిర్లింగ్, ఆండీ బాల్బీర్నీ(కెప్టెన్), గారెత్ డెలనీ, హారీ టెక్టర్, లోర్కెన్ టక్కర్(వికెట్ కీపర్), జార్జ్ డొక్రెల్, మార్క్ అడైర్, ఆండీ మెక్బ్రైన్, క్రేగ్ యంగ్, జాష్ లిటిల్, కొనోర్ ఒల్ఫెర్ట్.