అర్జెంటీనాకు భారత్‌ షాక్‌

ABN , First Publish Date - 2021-04-12T09:56:12+05:30 IST

ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భారత హాకీ జట్టు సంచలన విజయం నమోదు చేసింది.

అర్జెంటీనాకు భారత్‌ షాక్‌

బ్యూనస్‌ ఏయిర్స్‌: ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌లో భారత హాకీ జట్టు సంచలన విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ పెనాల్టీ షూటౌట్‌లో ఒలింపిక్‌ చాంపియన్‌ అర్జెంటీనాను ఓడించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్లు రెండేసి గోల్స్‌ చేయడంతో 2-2 స్కోరు సమమైంది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (21, 60వ నిమిషం), అర్జెంటీనా జట్టులో మార్టిన్‌ ఫెర్రెరో (28, 30) చెరి రెండు గోల్స్‌ చేశారు. షూటౌట్‌లో దిల్‌ప్రీత్‌ సింగ్‌ గోల్‌తో భారత్‌ 3-2తో బోనస్‌ విజయం సాధించింది. ప్రస్తుతం ఈ లీగ్‌లో భారత్‌ 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. అర్జెంటీనా (11) ఆరో స్థానంలో కొనసాగుతోంది. 

Updated Date - 2021-04-12T09:56:12+05:30 IST