మేము పర్యావరణ మార్పుల బాధితులం..కారకులం కాదు: భారత్

ABN , First Publish Date - 2021-10-29T03:27:05+05:30 IST

భారత్ మాత్రం పర్యవరణ రక్షణ చర్యలు చేపట్టే బాధ్యతను పూర్తిగా తనపైకి నెట్టకూడదని బుధవారం స్పష్టమైన ప్రకటన చేసింది.

మేము పర్యావరణ మార్పుల బాధితులం..కారకులం కాదు: భారత్

ఇంటర్నెట్ డెస్క్: పర్యావరణ మార్పుల కారణంగా మానవాళికి ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ విషయంలో చర్చించేందుకు వివిధ దేశాలు గ్లాస్‌గోవ్ వేదికగా కాప్26 చర్చలకు సిద్ధమవుతున్నాయి. త్వరలో ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో కర్బన ఉద్గారాల విడుదలను పూర్తిగా అరికడతామంటూ ప్రకటనలు చేయాలని, ఎప్పటివరకూ ఈ లక్ష్యాన్ని చేరుకుంటామో స్పష్టంగా తెలియజేయాలనే ఒత్తిడి ప్రపంచదేశాలపై పెరుగుతోంది. ఇందుకు భారత్‌ కూడా అతీతం కాదు.  అయితే.. భారత్ మాత్రం పర్యవరణ రక్షణ చర్యలు చేపట్టే బాధ్యతను పూర్తిగా తనపైకి నెట్టకూడదని బుధవారం స్పష్టమైన ప్రకటన చేసింది. ‘మేము పర్యావరణ మార్పుల బాధితులమే కానీ..కారకులం కాదు’ అంటూ పదునైన ప్రకటన చేసింది. అభివృద్ధి చెందిన దేశాలే ఈ భారంలో అధికం మోయాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్‌.పీ. గుప్తా స్పష్టమైన ప్రకటన చేశారు.


Updated Date - 2021-10-29T03:27:05+05:30 IST