2 వికెట్లను కోల్పోయిన భారత్..స్కోర్104/2
ABN , First Publish Date - 2020-12-02T16:06:34+05:30 IST
ఆసీస్తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సీన్ అబాట్ బౌలింగ్లో ఓపెనర్ శిఖర్ ధావన్...
ఓవల్: ఆసీస్తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ జట్టు రెండు వికెట్లను కోల్పోయింది. సీన్ అబాట్ బౌలింగ్లో ఓపెనర్ శిఖర్ ధావన్ (16) ఔటయ్యాడు. అగర్కు క్యాచ్ ఇచ్చి ధావన్ పెవిలియన్కు దారిపట్టాడు. మరో ఓపెనర్ శుభ్మన్ (33) కూడా అగర్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుతిరిగాడు. దీంతో భారత్ 82 పరుగులకే రెండు కీలకమైన వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ (36) రన్స్, అయ్యర్ (14) పరుగులతో ఆడుతున్నారు. ప్రస్తుత్తం భారత్ 20 ఓవర్ల ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లను కోల్పోయి 104 పరుగులు చేసింది. కాగా తొలుత టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లీ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఇప్పటికే భారత్ టీమ్ 2-0తో సిరీస్ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే. చివరి వన్డే మ్యాచ్లో గెలిచి పరువు కాపాడుకోవాలనే కసితో ఉంది.