ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. కొనసాగుతున్న భారత్ ఆధిపత్యం!

ABN , First Publish Date - 2021-05-13T21:53:25+05:30 IST

సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది.

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. కొనసాగుతున్న భారత్ ఆధిపత్యం!

సుదీర్ఘ ఫార్మాట్‌లో టీమిండియా ఆధిపత్యం కొనసాగుతోంది. వరుసగా ఐదో ఏడాది కూడా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన వార్షిక టెస్ట్ ర్యాంకింగ్స్ జాబితాలో న్యూజిలాండ్‌ను ఒక్క పాయింట్‌తో వెనక్కి నెట్టి టీమిండియా మొదటి స్థానాన్ని కాపాడుకుంది. 121 పాయింట్లు సాధించిన భారత్ తొలి స్థానంలోనూ, 120 పాయింట్లతో న్యూజిలాండ్ రెండో స్థానంలోనూ ఉన్నాయి.


భారత్, న్యూజిలాండ్ మధ్య జూన్ 18-22 మధ్య సౌతాంప్టన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగబోతున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ జాబితాలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో పాకిస్థాన్ (5), వెస్టిండీస్ (6), దక్షిణాఫ్రికా (7), శ్రీలంక (8), బంగ్లాదేశ్ (9), జింబాబ్వే (10) ఉన్నాయి. 

Updated Date - 2021-05-13T21:53:25+05:30 IST