భద్రాద్రి హుండీ ఆదాయం లెక్కింపు

ABN , First Publish Date - 2022-07-07T12:14:10+05:30 IST

భద్రాచలం సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు వచ్చింది. రామాలయ ప్రాంగణంలోని చిత్రకూట

భద్రాద్రి హుండీ ఆదాయం లెక్కింపు

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం సీతారామచంద్రస్వామి హుండీ ఆదాయం రూ.1.82 కోట్లు వచ్చింది. రామాలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో బుధవారం ఆలయ హుండీల లెక్కింపు నిర్వహించారు. ఇందులో రూ.1,82,33,186 నగదు, 130గ్రాముల బంగారం, ఒక కేజీ 900 గ్రాముల వెండి, 467 అమెరికా డాలర్లు, 10 యూఏఈ దీరామ్స్‌, ఇతర దేశాల కరెన్సీ వచ్చింది. ఇదిలాఉండగా దేవస్థానం హుండీలను చివరిసారిగా మే 2న లెక్కించామని, 65 రోజుల అనంతరం హుండీ లెక్కింపు బుధవారం నిర్వహించినట్లు దేవస్థానం ఈవో బి.శివాజీ తెలిపారు. 

Updated Date - 2022-07-07T12:14:10+05:30 IST