ఆసియా కప్ జట్టులో కోహ్లీ, రాహుల్
ABN , First Publish Date - 2022-08-09T09:49:27+05:30 IST
ఈనెల 27 నుంచి దుబాయ్లో జరిగే ఆసియాకప్ టీ20 టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రాహుల్ జట్టులోకి తిరిగి వచ్చారు.
గాయంతో బుమ్రా అవుట్
న్యూఢిల్లీ: ఈనెల 27 నుంచి దుబాయ్లో జరిగే ఆసియాకప్ టీ20 టోర్నీ కోసం 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. స్టార్ బ్యాటర్స్ విరాట్ కోహ్లీ, రాహుల్ జట్టులోకి తిరిగి వచ్చారు. విశ్రాంతి కారణంగా కోహ్లీ కరీబియన్ టూర్కు దూరమవగా.. గాయంతోపాటు కరోనాతో వైస్కెప్టెన్ రాహుల్ ఇబ్బందిపడ్డాడు. ఇక ఇషాన్, శాంసన్ చోటు కోల్పోగా శ్రేయాస్ అయ్యర్, అక్షర్, దీపక్ చాహర్లను స్టాండ్బైగా ఉంచారు. గాయాలతో బాధపడుతున్న బుమ్రా, హర్షల్ పేర్లను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. విండీ్సతో సిరీ్సలో రాణించిన యువ పేసర్ అర్ష్దీ్పపై సెలెక్టర్లు విశ్వాసం ఉంచడం విశేషం.
భారత జట్టు:
రోహిత్ (కెప్టెన్), రాహుల్, కోహ్లీ, సూర్యకుమార్, దీపక్ హుడా, పంత్, దినేశ్ కార్తీక్, హార్దిక్, జడేజా, అశ్విన్, చాహల్, బిష్ణోయ్, భువనేశ్వర్, అర్ష్దీప్, అవేశ్ ఖాన్.