జనవరిలో... జైసల్మేర్‌లో...

ABN , First Publish Date - 2020-12-06T05:30:00+05:30 IST

అక్షయ్‌కుమార్‌, కృతీసనన్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘బచ్చన్‌పాండే’. చాలాకాలంగా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌ కూడా నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి.

జనవరిలో... జైసల్మేర్‌లో...

అక్షయ్‌కుమార్‌, కృతీసనన్‌ జంటగా నటిస్తోన్న చిత్రం ‘బచ్చన్‌పాండే’. చాలాకాలంగా ఈ చిత్రంలో మరో హీరోయిన్‌  కూడా నటిస్తోందనే వార్తలు వస్తున్నాయి. వాటిని నిజం చేస్తూ మరో కథానాయికగా శ్రీలంక బ్యూటీ జాక్వలిన్‌ ఫెర్నాండేజ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ‘మరోసారి అక్షయ్‌తో కలసి నటించబోతున్నాను. ‘బచ్చన్‌పాండే’తో మా జంట మరో విజయం సాధిస్తుందని భావిస్తున్నాను. జనవరిలో జైసల్మేర్‌లో ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమవుతుంది. పూర్తిగా ఓ కొత్త పాత్రలో నటిస్తున్నాను’ అని తెలిపారు. ప్రస్తుతం ఆమె సల్మాన్‌ సరసన ‘కిక్‌ 2’లో, ‘భూత్‌ పోలీస్‌’, ‘సర్కస్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు కృతీసనన్‌ ‘బచ్చన్‌పాండే’లో జర్నలిస్ట్‌ పాత్రలో కనిపించనున్నారు..

Updated Date - 2020-12-06T05:30:00+05:30 IST