జైలుశిక్ష విధించిన తెలంగాణ వినియోగదారుల కమిషన్
ABN , First Publish Date - 2022-04-29T02:31:56+05:30 IST
జైలుశిక్ష విధిస్తూ తొలిసారి తెలంగాణ వినియోగదారుల కమిషన్
హైదరాబాద్: జైలుశిక్ష విధిస్తూ తొలిసారి తెలంగాణ వినియోగదారుల కమిషన్ తీర్పు ఇచ్చింది. ఘరోండ బిల్డర్స్ ఎండీ సునీల్ జె.సచ్దేవ్కు జైలుశిక్షను కమిషన్ విధించింది. 3 కేసుల్లో 6 నెలల చొప్పున జైలుశిక్షను విధించింది. సొమ్ము తీసుకొని ఫ్లాట్లు అప్పగించడం లేదని ఘరోండ బిల్డర్స్పై అభియోగాలు వచ్చాయి. ముగ్గురు బాధితులకు వడ్డీతో సొమ్ము చెల్లించాలని 2017లో కమిషన్ తీర్పు చెప్పింది. ఐదేళ్లైనా తీర్పు అమలు చేయడం లేదని బిల్డర్పై సీఎఫ్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది.