కువైట్లోని భారత ఎంబసీ కీలక ప్రకటన!
ABN , First Publish Date - 2021-03-24T20:14:57+05:30 IST
కువైట్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. బుధవారం రోజు (24 మార్చి 2021) మధ్యాహ్నం 1.30 గంటలకు ఓపెన్ హౌస్ను నిర్వహించినున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమంలో కు
కువైట్ సిటీ: కువైట్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. బుధవారం రోజు (24 మార్చి 2021) మధ్యాహ్నం 1.30 గంటలకు ఓపెన్ హౌస్ను నిర్వహించినున్నట్టు తెలిపింది. ఈ కార్యక్రమంలో కువైట్లోని భారత రాయబారి సిబి జార్జి పాల్గొని, కొవిడ్-19 వ్యాక్సినేషన్కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియపై మాట్లాడతారని పేర్కొంది. జేఈఈ, నీట్, నాటా (NATA) పరీక్షలకు సంబంధించిన అంశాంపై కీలక సమాచారం ఇవ్వనున్నట్టు చెప్పింది. ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని జూమ్లో నిర్వహించనున్నట్టు తెలిపింది. ఓపెన్ హౌస్ కార్యక్రమంలో మీటింగ్ ఐడీ నెంబర్:9552240, పాస్వర్డ్:831684 ను ఉపయోగించి https://zoom.us/j/95522401194?pwd=ZXBTMjNBZ0hxckwybEFFVINpbFI1UT09 లింక్ ద్వారా పాల్గొనొచ్చని పేర్కొంది.