ఆ మార్గంలో సీఎం కాన్వాయ్ వెళ్లగలిగితే రాజకీయాలు మానేస్తా:
ABN , First Publish Date - 2020-10-24T08:49:17+05:30 IST
‘సీఎం జగన్కు చాలెంజ్ చేస్తున్నాను. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వరకూ గోదావరి ఫోర్త్ బ్రిడ్జిపై సీఎం కాన్వాయ్తో రాగలిగితే.. నన్నేం చేయమన్నా సిద్ధం.
హర్షకుమార్
రాజమహేంద్రవరం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ‘సీఎం జగన్కు చాలెంజ్ చేస్తున్నాను. కొవ్వూరు నుంచి రాజమహేంద్రవరం వరకూ గోదావరి ఫోర్త్ బ్రిడ్జిపై సీఎం కాన్వాయ్తో రాగలిగితే.. నన్నేం చేయమన్నా సిద్ధం. రాజకీయాలు మానేయమన్నా మానేస్తా. రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. ఈ రోడ్డు మీద లారీల భాగాలు కూడా విరిగిపోతున్నాయి’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు.
‘నేను పుట్టిన తర్వాత ఇంత అధ్వానమైన రోడ్లను చూడలేదు. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం రావడానికి ఐదారు గంటలు పడుతోంది. రాష్ట్రం బాధ్యత తీసుకోవాలి. టోలు వసూలు చేసేవారు, రోడ్డు బాగుండేలా చూడాలి. రోడ్డు బాగు చేసే వరకూ ప్రతి టోల్ ఆపేయాలి’ అని మాజీ ఎంపీ డిమాండ్ చేశారు.