AP CM YS Jaganతో ఆమ్రపాలి భేటీ.. ఆంతర్యమేంటో..!?
ABN , First Publish Date - 2022-01-04T16:15:26+05:30 IST
ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డితో ..
న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డితో.. ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పనిచేస్తున్న కాటా ఆమ్రపాలి.. ఆయన నివాసంలో కలుసుకుని చర్చలు జరిపారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన ఆమ్రపాలి ఆంధ్రా కేడర్ నుంచి తెలంగాణ కేడర్కు మారిన విషయం తెలిసిందే. ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గత ఏడాది పీఎంఓలో ఆమ్రపాలిని కలుసుకుని, ఆమెతో ఫోటో దిగడంతోపాటు ఆమె ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన కీలక విషయాల గురించి తెలుసుకునేందుకు ప్రవీణ్ ప్రకాశ్ ఆమె సహకారం తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నేపథ్యంలో ఆమ్రపాలి నేరుగా జగన్తో భేటీ కావడం విశేషం.
నిజానికి.. తన కార్యాలయంలో అధికారులు ఇలా బయటకు వచ్చి ముఖ్యమంత్రులు, ఇతర రాజకీయ నేతలు, జర్నలిస్టులను కలుసుకోవడం ప్రధానమంత్రి ఇష్టపడరని ఒక అధికారి చెప్పారు. కాగా.. జగన్ ఇవాళ కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. సోమవారం నాడు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో వేర్వేరుగా భేటీ అయిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం కూడా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు.