శాండ్విచ్ తింటుంటే బ్యాటింగ్కు సిద్ధమవ్వమన్నాడు: రైనా
ABN , First Publish Date - 2020-05-23T22:59:07+05:30 IST
ఇండియా, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అభిమానులకు పండగ. ఇక ప్రపంచకప్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన...
న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటేనే అభిమానులకు పండగ. ఇక ప్రపంచకప్ లాంటి ప్రతిష్ఠాత్మకమైన టోర్నీ అయితే ఉత్కంఠ మరింత పెరుగుతుంది. అదే ఆ మ్యాచ్లో భారత్ పాక్ను చిత్తుగా ఓడించిందంటే ఇక మన అభిమానుల ఆనందానికి అవధులుండవు. అలాంటి మ్యాచ్లలో ఒకటి 2015 వరల్డ్ కప్ గ్రూప్ మ్యాచ్. ఇటీవల ఓ ఆన్లైన్ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేశ్ రైనా అప్పటి విషయాలను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ మ్యాచ్లో ధోనీ తన బ్యాటింగ్ ఆర్డర్ను మార్చి ముందుగా బ్యాటింగ్కు పంపించాడని చెప్పాడు. ‘నేను శాండ్విచ్ తింటున్నా. ధోనీ నా దగ్గరకు వచ్చాడు. నాలుగో నెంబరులో బ్యాటింగ్కు వెళ్లాలని, వెంటనే ప్యాడ్లు కట్టుకోవాలని సూచించాడు. ధోనీ నిర్ణయాన్ని నేనెప్పుడూ ప్రశ్నించలేదు. వెంటనే బ్యాటింగ్కు సిద్ధమయ్యా. అప్పటికే ధవన్, కోహ్లీ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. అయితే కొద్ది సేపటికే ధవన్ అవుటవ్వడంతో నేను బ్యాటింగ్కు వెళ్లా. చక్కగా బ్యాటింగ్ చేసి 70 నుంచి 80 పరుగులు చేశారు. జట్టు గెలుపులో ఆ పరుగులు బాగా ఉపయోగపడ్డాయి’ అని రైనా చెప్పుకొచ్చాడు.
ఇదిలా ఉంటే జట్టు కూర్పు ప్రకారం నాలుగో నెంబరులో రహానే బ్యాటింగ్కు వెళ్లాల్సి ఉంది. అయితే 20 ఓవర్ల తరువాత ధోనీ అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో రైనా ముందుగా బ్యాంటింగ్కు వెళ్లాడు. కోహ్లీతో కలిసి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొలిపి జట్టును పటిష్ఠ స్థాయిలో నిలిపాడు. అయితే కోహ్లీ 107 పరుగులతో సెంచరీ చేయడంతో రైనా ఇన్నింగ్స్ వెలుగులోకి రాలేదు.