రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాను: రఘురామ

ABN , First Publish Date - 2022-01-08T02:04:00+05:30 IST

త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అంతేకాదు ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజధాని అమరావతి ఎజెండాతో..

రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్తాను: రఘురామ

హైదరాబాద్: త్వరలో ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. అంతేకాదు ఎంపీ పదవికి రాజీనామా చేసి రాజధాని అమరావతి ఎజెండాతో.. మళ్ళీ ఎన్నికలకు వెళ్తానని ప్రకటించారు. తనపై అనర్హత వేటు వేయించడానికి ఎంత సమయం కావాలో‌ చెప్పాలని ఏబీఎన్ డిబెట్‌లో రఘురామ సవాల్ విసిరారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎంత అసహ్యించుకుంటున్నారో.. తన ఎన్నిక ద్వారా నిరూపిస్తానని తెలిపారు. తనను రాజీనామా చేయమని ఎవరూ అడగలేదని, తాను ప్రజల మద్దతుతో పోటీ చేయాలనుకుంటున్నానని తెలిపారు. 


‘‘నా రాజీనామాకు పార్టీలతో సంబంధం లేదు. నావి దొంగ సర్టిఫికెట్లు కావు. ఒర్జినల్‌ సర్టిఫికెట్లతో పాస్‌ అయ్యాను. నా పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. ప్రజల పట్ల విశ్వాసమున్న పార్టీలన్నీ.. నాకు మద్దతిస్తాయని నా నమ్మకం. రాజధాని అమరావతి ఎజెండాతోనే ఎన్నికలకు వెళ్తా. ప్రజల సమస్యలు తీర్చడానికి వచ్చే ఎలక్షన్‌ నాది’’ అని రఘురామ ప్రకటించారు.


Updated Date - 2022-01-08T02:04:00+05:30 IST