Hyderabad: గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత
ABN , First Publish Date - 2022-04-08T21:25:40+05:30 IST
Hyderabad: గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత
హైదరాబాద్: గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీజీపీని కలిసేందుకు మహిళా కాంగ్రెస్ నేతలు ర్యాలీగా బయల్దేరి వెళ్లారు. గాంధీభవన్ గేట్ దగ్గర మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కాసేపటిపాటు పోలీసులు, మహిళా కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట జరిగింది. ట్రాఫిక్ జాం కావడంతో మహిళా కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఫిట్స్తో పడిపోయారు. సునీతారావును హుటాహుటిన పోలీసులు ఆస్పత్రికి తరలించారు.