మెట్రోట్రాక్పై ఆగంతకుడు...నిలిచిన మెట్రోరైలు
ABN , First Publish Date - 2022-05-02T16:22:21+05:30 IST
మెట్రోట్రాక్పైకి ఓ గుర్తు తెలియని ఆగంతకుడు రావడంతో సింగిల్ ట్రాక్పైనే మెట్రో రైలు నడిచిన ఘటన సికింద్రాబాద్ వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది.
హైదరాబాద్: మెట్రోట్రాక్పైకి ఓ గుర్తు తెలియని ఆగంతకుడు రావడంతో మెట్రో రైలు నిలిచిపోయిన ఘటన సికింద్రాబాద్ వెస్ట్ రైల్వే స్టేషన్ వద్ద చోటు చేసుకుంది. సికింద్రాబాద్ వెస్ట్ నుంచి జేబీఎస్ రూట్లో మెట్రో ట్రాక్పై గుర్తు తెలియని వ్యక్తి వెళ్లాడు. ట్రాక్పైకి వెళ్లిన వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది గుర్తించింది. అతడిని పట్టుకుని ముషీరాబాద్ పోలీస్స్టేషన్లో అప్పగించారు. యువకుడు ట్రాక్పైకి రావడంతో సుమారు గంట పాటు ఆ మార్గంలో మెట్రోరైల్ను అధికారులు నిలిపివేశారు. ఆ తరువాత యధావిధిగా మెట్రో ట్రైన్స్ను పునరుద్ధరణ చేశారు.