ఉపాధ్యాయుల అప్పీళ్లను రేపటి వరకు తేల్చాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
ABN , First Publish Date - 2021-12-29T22:05:27+05:30 IST
ఉపాధ్యాయుల అప్పీళ్లను రేపటి వరకు తేల్చాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపుల వివాదాలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: ఉపాధ్యాయుల అప్పీళ్లను రేపటి వరకు తేల్చాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపుల వివాదాలపై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఉపాధ్యాయుల అప్పీళ్లను ప్రభుత్వానికి పంపించాలని డీఈఓలకు హైకోర్టు ఆదేశించింది. అప్పీలు చేసుకున్న ఉపాధ్యాయుల కేటాయింపులను పునఃపరిశీలించాలని హైకోర్టు ఆదేశించింది. జీఓలోని సీనియారిటీ, మెడికల్, తదితర అంశాల ఆధారంగా అప్పీళ్లను పరిశీలించాలని కోర్టు సూచించింది.