పంజాగుట్ట పీఎస్ను దేశంలో నంబర్1గా నిలుపుతాం!
ABN , First Publish Date - 2021-03-04T18:03:36+05:30 IST
పంజాగుట్ట పోలీస్స్టేషన్ను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామని...
హైదరాబాద్/పంజాగుట్ట : పంజాగుట్ట పోలీస్స్టేషన్ను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామని నగర్ జాయింట్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ అన్నారు. మంచుకొండ ఫౌండేషన్ సహకారంతో రూ. 10 లక్షలతో స్టేషన్ భవనంపై ఏర్పాటు చేసిన సోలార్ పవర్ ప్లాంట్ను, భవన నిర్మాణ సంస్థ సహకారంతో అభివృద్ధి చేసిన పార్కింగ్ ప్రాంతాన్ని ఆయన బుధవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మంచుకొండ ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ ప్రకాశం, ట్రస్టీలు రవికుమార్, సురేందర్, ఏసీపీ పీవీ గణేష్, ఇన్స్పెక్టర్ నిరంజన్రెడ్డి, డీఐ నాగయ్య, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
పూర్తయిన పనులు
‘ఠాణా సమస్యలపై హైరానా.. గతంలో దేశంలో నెంబర్ టూ.. ప్రస్తుతం అధ్వానంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్’ అనే శీర్షికతో గత ఏడాది అక్టోబర్లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కొంతకాలం నుంచి ప్రారంభమైన పనులు ప్రస్తుతం పూర్తయ్యాయి. కూల్చివేసిన పోలీస్ క్వార్టర్ల చుట్టూ ప్రహరీ నిర్మించాల్సి ఉంది.