18వ రౌండ్ కౌంటింగ్ పూర్తి.. ఈటల ఆధిక్యం ఎంతంటే..?

ABN , First Publish Date - 2021-11-02T23:06:59+05:30 IST

ఉపఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. ప్రస్తుతం 18వ రౌండ్ లెక్కింపు పూర్తి అయింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఈ రౌండ్‌లో...

18వ రౌండ్ కౌంటింగ్ పూర్తి.. ఈటల ఆధిక్యం ఎంతంటే..?

హుజూరాబాద్: ఉపఎన్నికల కౌంటింగ్‌లో బీజేపీ ఆధిక్యం కొనసాగుతోంది. ప్రస్తుతం 18వ రౌండ్ లెక్కింపు పూర్తి అయింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఈ రౌండ్‌లో 1, 876 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు. మొత్తంగా చూస్తే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై ఈటల రాజేందర్ 16, 494 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 


ప్రస్తుతం ఈటల రాజేందర్ సొంత మండలంలో 19వ రౌండ్ కౌంటింగ్ ప్రారంభమైంది. 19 నుంచి 22వరకు కమలాపూర్ మండలానికి సంబంధించిన ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. ఈటల రాజేందర్ సొంత మండలం కమలాపురం కావడంతో లీడ్‌పై సర్వత్రా ఆసక్తి  నెలకొంది. 


Updated Date - 2021-11-02T23:06:59+05:30 IST