భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2020-06-07T15:18:53+05:30 IST
ఔట్పోస్టు కానిస్టేబుల్ రామచంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్నూలు/ఆదోని : భార్య పుట్టినింటి వెళ్లిపోయిందని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్న చేశాడు. ఔట్పోస్టు కానిస్టేబుల్ రామచంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆస్పరి మండలం బిల్లేకల్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు, భార్య రామలక్ష్మి మధ్య చిన్నచిన్న గొడవలు పడేవారు. పది రోజుల క్రితం రామలక్ష్మి పుట్టినిల్లు బసరకోడుకు వెళ్లిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాసులు శనివారం ఓ పొలంలో కూల్డ్రింగ్లో క్రిమి సంహారక మందు కలుపుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆస్పరి పోలీసులు కేసు విచారణ చేపట్టారు.