కిరాయి ముఠాతో భర్త హత్యకు కుట్ర
ABN , First Publish Date - 2021-12-26T17:07:28+05:30 IST
తన వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భర్తను కిరాయి ముఠాతో హత్య చేయించేందుకు ప్రయత్నించిన యువతి సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఐలాండ్ గ్రౌండ్స్ సమీపం అన్నై
- భార్య సహా నలుగురి అరెస్టు
చెన్నై: తన వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న భర్తను కిరాయి ముఠాతో హత్య చేయించేందుకు ప్రయత్నించిన యువతి సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. స్థానిక ఐలాండ్ గ్రౌండ్స్ సమీపం అన్నై సత్యానగర్ ప్రాంతంలో జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. అన్నై సత్యానగర్లో అక్బర్ బాషా (28), యాస్మిన్ భాను అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. ఇటీవల యాస్మిన్ భానుకు మరో వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న భర్త అక్బర్బాషా ఆమెను తీవ్రంగా మందలించాడు. దీనితో ఆగ్రహించిన యాస్మిన్ భాను ఎరుకంజేరిలో ఉన్నతారణి అనే స్నేహితురాలి ద్వారా భర్తను హత్యచేయడానికి సిద్ధమైంది. తారణి తిరువికానగర్కు చెందిన అప్పు, వ్యాసార్పాడికి చెందిన శరవణన్ అనే కిరాయిగూండాల చేత అక్బర్బాషాను హత్య చేయిస్తానని మాటిచ్చింది. ఆ మేరకు యాస్మిన్భాను తన భర్తను హత్య చేయడానికి కిరాయి గూండాలకు లక్ష రూపాయలు ఇచ్చేందుకు అంగీకరించి అడ్వాన్స్గా రూ.60వేలను ఇచ్చింది. ఆ కిరాయి గూండాలు ముత్తుసామి వంతెన వద్ద నడచి వెళుతున్న అక్బర్బాషాపై కత్తులతో దాడి జరిపారు. తీవ్రంగా గాయపడిన అక్బర్బాషాను చికిత్స నిమిత్తం జనరల్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరిపినప్పుడు అక్బర్బాషా భార్య యాస్మిన్ భాను కిరాయిగూండాలతో హతమార్చేందుకు ప్రయత్నించినట్టు నిర్ధారణ అయ్యింది. వెంటనే యాస్మిన్ భాను, ఆమె స్నేహితురాలు తరాణి, కిరాయిగూండాలు అప్పు, శరవణన్ను పోలీసులు అరెస్టు చేశారు.