హుస్సాముద్దీన్ శుభారంభం
ABN , First Publish Date - 2021-03-03T09:39:07+05:30 IST
బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నీలో మంగళవారం ప్రకటించిన డ్రాలో ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్, ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత అమిత్ పంగల్తో సహా మొత్తం 12 మంది భారత బాక్సర్లు...
కాస్టెల్లాన్ (స్పెయిన్): బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నీలో మంగళవారం ప్రకటించిన డ్రాలో ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్, ఆసియా గేమ్స్ స్వర్ణ పతక విజేత అమిత్ పంగల్తో సహా మొత్తం 12 మంది భారత బాక్సర్లు నేరుగా క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఇక తెలుగు కుర్రాడు మహ్మద్ హుస్సాముద్దీన్ టోర్నీలో శుభారంభం చేశాడు. తొలిరౌండ్లో స్థానిక బాక్సర్ జాన్ మాన్యుయెల్ టోరె్సను హుస్సాముద్దీన్ చిత్తుచేసి తదుపరి బౌట్కు దూసుకెళ్లాడు.