హుస్సాముద్దీన్కు రజతం
ABN , First Publish Date - 2021-03-07T09:39:57+05:30 IST
బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నీలో తెలుగు బాక్సర్ హుస్సాముద్దీన్ (57 కేజీలు) రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు. హుస్సాముద్దీన్ సహచర బాక్సర్ కరోనా పాజిటివ్గా తేలడంతో అతను ఫైనల్ నుంచి తప్పుకున్నట్టు...
కాస్టెల్లాన్ (స్పెయిన్): బాక్సమ్ ఇంటర్నేషనల్ టోర్నీలో తెలుగు బాక్సర్ హుస్సాముద్దీన్ (57 కేజీలు) రజత పతకంతో సరిపెట్టుకొన్నాడు. హుస్సాముద్దీన్ సహచర బాక్సర్ కరోనా పాజిటివ్గా తేలడంతో అతను ఫైనల్ నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. 63 కేజీల ఫైనల్లో నికోలాయ్ టెర్టారియన్నుపై గెలిచి మనీష్ కౌశిక్ స్వర్ణ పతకం సాధించాడు. అయితే వికాస్ కిషన్ (69 కేజీలు) ముబా సిసోఖో (స్పెయిన్) చేతిలో ఓడాడు. కాగా, మహిళల ఫైనల్స్లో ఓడిన పూజా రాణి (75), జాస్మిన్ (57) రజత పతకాలతో సంతృప్తి చెందారు. సిమ్రన్జిత్ కౌర్ (60 కేజీలు) గాయంతో ఫైనల్లో పాల్గొనలేదు.