వారు ఇప్పుడు ఎలా నచ్చారో?:
ABN , First Publish Date - 2020-10-19T07:11:36+05:30 IST
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చని అదానీ, అంబానీ, జీఎంఆర్... ఇప్పుడు ఎలా నచ్చుతున్నారో సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు.
బండారు
విశాఖపట్నం, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నచ్చని అదానీ, అంబానీ, జీఎంఆర్... ఇప్పుడు ఎలా నచ్చుతున్నారో సీఎం జగన్మోహన్రెడ్డి చెప్పాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు.
ఆయన ఆదివారం విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ... టీడీపీ హయాంలో బొత్స సత్యనారాయణ భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణాన్ని వ్యతిరేకించి. రైతులతో ఆందోళనలు చేయించారని, ఇప్పుడు అదే కంపెనీకి ఎయిర్పోర్టు నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక ఉన్న మతలబు ఏమిటన్నారు.