ఎక్కువ మందికి సేవలు అందించాలనే
ABN , First Publish Date - 2020-08-10T09:21:21+05:30 IST
‘‘రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బందరు రోడ్డులోని రమేశ్ హాస్పిటల్ను పూర్తిగా కరోనా బాధితుల కోసం
- అధికారుల అనుమతితోనే ప్యాలెస్లో వైద్యం
- రమేశ్ హాస్పిటల్స్ అధినేత ప్రకటన
విజయవాడ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ‘‘రోజురోజుకూ కరోనా బాధితుల సంఖ్య పెరుగుతున్న దృష్ట్యా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బందరు రోడ్డులోని రమేశ్ హాస్పిటల్ను పూర్తిగా కరోనా బాధితుల కోసం కేటాయించాం. అందులో పడకల సంఖ్య 30 మాత్రమే ఉండటం, కరోనా పేషెంట్లను చేర్చుకోవాలని ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల వద్ద నుంచి రాత్రీపగలూ అభ్యర్థనలు రావటం వల్ల అధికారుల అనుమతితోనే స్వర్ణా ప్యాలెస్ హోటల్లో వైద్య సదుపాయాలు సమకూర్చాం. ఆ హోటల్ నిర్వహణతోగానీ, వారి చార్జీలతోగానీ ఏ రకమైన సంబంధమూ లేకుండా మెరుగైన వైద్య సేవలు అందించే బాధ్యత మాత్రమే రమేశ్ హాస్పిటల్ తీసుకుంది. చక్కగా కోలుకుంటున్న కరోనా బాధితుల్లో కొంతమంది ఆదివారం స్వర్ణా ప్యాలెస్ హోటల్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరం. ఆ సంఘటన ఆస్పత్రి యాజమాన్యానికీ, సిబ్బందికీ తీరని బాధ కలిగించింది’ అని రమేశ్ హాస్పిటల్ అధినేత డాక్టర్ పి.రమేశ్బాబు ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఎక్కువ మందికి వైద్యం అందించాలనే ఉద్దేశంతో అన్ని సౌకర్యాలు ఉన్న హోటల్లో ప్రభుత్వ అనుమతితోనే బాధితులకు వైద్య సహాయం అందిస్తున్నామని వివరించారు.