రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య: సుచరిత

ABN , First Publish Date - 2020-10-30T17:11:08+05:30 IST

రైతులకు సంకెళ్లు వేసే విషయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని హోంమంత్రి సుచరిత అన్నారు. వెలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని హోంమంత్రి సుచరిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులకు సంకెళ్లు వేసిన వారిపై చర్యలు

రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య: సుచరిత

విశాఖ: రైతులకు సంకెళ్లు వేయడాన్ని హోంమంత్రి సుచరిత తప్పుపట్టారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు. వెలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని హోంమంత్రి సుచరిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులకు సంకెళ్లు వేసిన వారిపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులను అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం జగన్ పాలన సాగుతోందని పేర్కొన్నారు. 


మూడు రాజధానులకు మద్దతుగా ఆందోళన చేస్తున్నవారిని అడ్డుకున్న రైతులను పోలీసులు అరెస్ట్ చేశారు. సంకెళ్లు వేసి తీసుకెళ్లడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో రైతులకు సంకెళ్లు వేసిన పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు.

Updated Date - 2020-10-30T17:11:08+05:30 IST