కోనసీమలో అల్లర్లపై హోంమంత్రి వనిత

ABN , First Publish Date - 2022-05-25T01:13:46+05:30 IST

కోనసీమలో జరుగుతున్న అల్లర్లపై హోంమంత్రి వనిత స్పందించారు. స్థానిక ప్రజల అభీష్టం మేరకే...

కోనసీమలో అల్లర్లపై హోంమంత్రి వనిత

అమరావతి: కోనసీమలో జరుగుతున్న అల్లర్లపై హోంమంత్రి వనిత స్పందించారు.  స్థానిక ప్రజల అభీష్టం మేరకే అంబేద్కర్‌ పేరు పెట్టామని ఆమె పేర్కొన్నారు. అల్లర్ల వెనుక టీడీపీ, జనసేన ఉందని చెప్పారు. అంబేద్కర్‌ పేరును వ్యతిరేకించడం సరికాదని సూచించారు.  పోలీస్‌ వాహనాలు, బస్సులను ధ్వంసం చేసి తగలబెట్టారని చెప్పారు. పోలీసులపై దాడి ఘటనపై విచారణకు ఆదేశిస్తామన్నారు. కొంతమంది కుట్రపన్ని వెనకుండి నడిపిస్తున్నారని,  నిందితులు ఎవరైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదదని మంత్రి వనిత హెచ్చరించారు. 


Updated Date - 2022-05-25T01:13:46+05:30 IST