చిన్నారి హత్యకేసుపై ఉన్నతస్థాయి సమావేశం

ABN , First Publish Date - 2021-09-14T22:51:13+05:30 IST

నగరంలోని సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యకేసుపై

చిన్నారి హత్యకేసుపై ఉన్నతస్థాయి సమావేశం

హైదరాబాద్: నగరంలో సంచలనం సృష్టించిన సైదాబాద్ చిన్నారి హత్యకేసుపై పోలీస్ అధికారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. హైదరాబాద్ క్రైమ్స్ అదనపు సీపీ నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈస్ట్‌జోన్ జాయింట్ డీసీపీ, టాస్క్‌ఫోర్స్ డీసీపీ సమావేశంలో పాల్గొన్నారు. వారితో పాటు సైదాబాద్ పోలీస్ అధికారులు సమీక్షలో పాల్గొన్నారు. నిందితులను పట్టుకోవడానికి 10 బృందాలతో గాలింపు చర్యలు చేపడుతున్నామని అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-09-14T22:51:13+05:30 IST