సీఐడీ చీఫ్ సునీల్ కుమార్కు హైకోర్టు నోటీసులు
ABN , First Publish Date - 2022-01-31T20:32:23+05:30 IST
సీఐడీ చీఫ్ సునీల్ కుమార్కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సునీల్ కుమార్పై ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అమరావతి: సీఐడీ చీఫ్ సునీల్ కుమార్కు ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సునీల్ కుమార్పై ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సునీల్ కుమార్ వ్యక్తిగతంగా తనను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. మతమార్పిడులకు పాల్పడుతున్నారంటూ పిటిషన్లో ప్రస్తావించారు. సునీల్ దంపతుల మధ్య వివాదాల్లో తనను టార్గెట్ చేశాడని తెలిపారు. కౌంటర్ దాఖలు చేయాలని సునీల్ కుమార్కు ఏపీ హైకోర్టు ఆదేశించారు.
ఇటీవల ‘‘నన్ను హత్య చేయడానికి సీఎం జగన్మోహన్రెడ్డి ప్రోద్బలంతో ఏపీ సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ కుట్ర పన్నారు. నా నియోజకవర్గం నరసాపురంలోనే నన్ను హత్య చేయించడానికి జార్ఖండ్కు చెందిన గూండాలను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సీఐడీ చీఫ్తో పాటు సీఎం నుంచీ నాకు ప్రాణ హానీ ఉంది’’ అని రఘురామకృష్ణరాజు ఆరోపించారు.