శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి శేషషాయి
ABN , First Publish Date - 2021-10-12T01:06:30+05:30 IST
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో
తిరుమల: ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శేషసాయి సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలమూర్తిని దర్శించుకున్నారు.అనంతరం రంగనాయక మండపానికి చేరుకున్న న్యాయమూర్తికి వేదపండితులు ఆశీర్వదించగా, లడ్డూప్రసాదాలను అధికారులు అందజేశారు. అలాగే తమిళనాడు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుష్ప సత్యనారాయణ కూడా శ్రీవారిని దర్శించుకున్నారు.