శీలం రంగయ్య కస్టోడియల్ మృతిపై హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2021-11-11T02:40:53+05:30 IST

పెద్దపల్లి జిల్లాలోని మంథని పీఎస్‌లో శీలం రంగయ్య కస్టోడియల్

శీలం రంగయ్య కస్టోడియల్ మృతిపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: పెద్దపల్లి జిల్లాలోని మంథని పీఎస్‌లో శీలం రంగయ్య కస్టోడియల్ మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. న్యాయవాది నాగమణి పిల్‌పై సీజే జస్టిస్ ఎస్‌సీ శర్మ, జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి ధర్మాసనం విచారణ జరిపింది. గతేడాది మే 20న మంథని పీఎస్‌లో శీలం రంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. శీలం రంగయ్య ఆత్మహత్యపై ఇప్పటికే హైదరాబాద్ సీపీ నివేదిక సమర్పించారు. అయితే పిటిషనర్ హత్యకు గురైనందున.. అమికస్ క్యూరీ దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు. కస్టోడియల్ మృతికి బాధ్యులైన వారిపై ఏం చర్యలు తీసుకుంటారని ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. ఏం చర్యలు తీసుకుంటారో నివేదిక సమర్పించాలని డీజీపీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణను డిసెంబరు 12కి హైకోర్టు వాయిదా వేసింది. 

Updated Date - 2021-11-11T02:40:53+05:30 IST