కోర్టులను భయభ్రాతులకు గురిచేసే యత్నం: హైకోర్టు సీనియర్ న్యాయవాది
ABN , First Publish Date - 2020-05-27T01:07:42+05:30 IST
కోర్టులను భయభ్రాతులకు గురిచేసే యత్నం: హైకోర్టు సీనియర్ న్యాయవాది
హైదరాబాద్: ఉన్నతమైన పదవుల్లో ఉన్న న్యాయమూర్తులపై పోస్టులు బాధాకరమని హైకోర్టు సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణ అన్నారు. సోషల్ మీడియాలో న్యాయమూర్తులను దూషించడం తగదని లక్ష్మీనారాయణ చెప్పారు. జడ్జిలను ఉద్దేశపూర్వకంగా కించపరిచారని, కోర్టులను రాజకీయాలకు వేదికగా చేసుకోవడం బాధకలిగించిందని లక్ష్మీనారాయణ అన్నారు. కోర్టులకు లేనిపోనివి ఆపాదిస్తున్నారని, కోర్టులను భయబ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కోర్టు తీర్పుల్లో ఎలాంటి పక్షపాతం ఉండదని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు.