టీడీపీ ఇన్‌చార్జ్‌లు, పలువురు ఎమ్మెల్యేలకు హైకమాండ్ పిలుపు

ABN , First Publish Date - 2022-02-18T00:11:52+05:30 IST

టీడీపీ ఇన్‌చార్జ్‌లు, పలువురు ఎమ్మెల్యేలకు పార్టీ హైకమాండ్

టీడీపీ ఇన్‌చార్జ్‌లు, పలువురు ఎమ్మెల్యేలకు హైకమాండ్ పిలుపు

అమరావతి: టీడీపీ ఇన్‌చార్జ్‌లు, పలువురు ఎమ్మెల్యేలకు పార్టీ హైకమాండ్ పిలుపు పంపింది. మొత్తం 12 మందిని రేపు రావాల్సిందిగా హైకమాండ్ కోరింది. విశాఖ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా రావాలని అధిష్టానం ఆదేశించింది. 2019 ఎన్నికల తర్వాత పార్టీలో శ్రీనివాసరావు క్రియాశీలకంగా ఉండడం లేదు. ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. రేపు చంద్రబాబును కలుస్తానని గంటా చెప్పారని పార్టీ వర్గాలు తెలిపాయి. 


Updated Date - 2022-02-18T00:11:52+05:30 IST