వైకల్యాన్ని అధిగమించి..

ABN , First Publish Date - 2020-03-03T07:36:18+05:30 IST

అతనికి ఓ చేయి, ఓ కాలు లేదు. అయితేనేం గుండెల నిండా ఆత్మవిశ్వాసం, దృఢమైన మనో సంకల్పం, లక్ష్యాన్ని సాధించే పట్టుదల ఉన్నాయి. అందుకే ఎత్తయిన పర్వతాలు సైతం అతనికి తలవంచుతున్నాయి. యాదాద్రి భువనగిరి

వైకల్యాన్ని అధిగమించి..

చౌటుప్పల్‌ రూరల్‌ (ఆంధ్రజ్యోతి): అతనికి ఓ చేయి, ఓ కాలు లేదు. అయితేనేం గుండెల నిండా ఆత్మవిశ్వాసం, దృఢమైన మనో సంకల్పం, లక్ష్యాన్ని సాధించే పట్టుదల ఉన్నాయి. అందుకే ఎత్తయిన పర్వతాలు సైతం అతనికి తలవంచుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం పీపల్‌పహాడ్‌ గ్రామానికి చెందిన చిదుగుళ్ల శేఖర్‌గౌడ్‌ ఆస్ట్రేలియా ఖండంలోని అత్యంత ఎత్తయిన కొసికొ పర్వతాన్ని అధిరోహించి భారత పతాకాన్ని ఎగురవేశాడు. ఫిబ్రవరి 28న మొదలైన ఈ యాత్ర సోమవారం పూర్తయింది. యూరప్‌ ఖండంలోని ఎల్‌బ్రస్‌, ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాలను అధిరోహించిన తొలి భారత దివ్యాంగుడిగా శేఖర్‌గౌడ్‌ రికార్డు నెలకొల్పాడు. త్వరలో దక్షిణాఫ్రికా ఖండంలోని ఎత్తయిన ఆకాన్‌ కాగువ పర్వతాన్ని అధిరోహించనున్నట్లు శేఖర్‌గౌడ్‌ తెలిపాడు.

Updated Date - 2020-03-03T07:36:18+05:30 IST