ఏపీతో సత్సంబంధాలున్నాయి: కేటీఆర్
ABN , First Publish Date - 2020-08-10T10:07:25+05:30 IST
‘‘కృష్ణా నదీ జలాల విషయంలో చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటం కొనసాగుతుంది. దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘కృష్ణా నదీ జలాల విషయంలో చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటం కొనసాగుతుంది. దీనిపై ఇప్పటికే సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాం. ఆంధ్రప్రదేశ్తో సత్సంబంధాలున్నప్పటికీ రాష్ట్ర హక్కుల విషయంలో రాజీ పడేది లేదు’’ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆదివారం ట్విటర్ వేదికగా ‘ఆస్క్ కేటీఆర్’ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో నెటిజన్లతో మంత్రి సంభాషించారు.