బుక్ ఫెయిర్ ను సందర్శించిన హర్యానా గవర్నర్

ABN , First Publish Date - 2021-12-25T00:34:15+05:30 IST

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎన్టీఆర్ స్డేడియంలో కొనసాగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించారు.

బుక్ ఫెయిర్ ను సందర్శించిన హర్యానా గవర్నర్

హైదరాబాద్: హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఎన్టీఆర్ స్డేడియంలో కొనసాగుతున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్ ను సందర్శించారు. శుక్రవారం నగరానికి వచ్చిన ఆయన బుక్ ఫెయిర్ లోని డీపీడీ స్టాల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ పిల్లలు తమ సబ్జెక్ట్ పుస్తకాలతో పాటు అన్ని రకాల పుస్తకాలను చదవాలని అన్నారు.పుస్తక పఠనం వల్ల ఆలోచన, మేధస్సుపెరుగుతుందన్నారు ఈ సందర్భంగా పబ్లికేషన్ డివిజన్ అధికారులను ఆయన ప్రశంసించారు.ఆజాదీ కా అమ`త్ మహోత్సవ్ లో భాగంగా  నవీన భారత నిర్మాణానికి సంబంధించిన పుస్తకాలు, సర్ధార్ వల్లభాయ్ పటేల్ జీవిత చరిత్ర, ఇతర పలు రకాల పుస్తకాలను ప్రచురిస్తున్నందుకు వారిని అభినందించారు. 

Updated Date - 2021-12-25T00:34:15+05:30 IST