100 పడకల కోవిడ్ వార్డును ప్రారంభిస్తాం: హరీశ్రావు
ABN , First Publish Date - 2020-07-12T02:03:41+05:30 IST
100 పడకల కోవిడ్ వార్డును ప్రారంభిస్తాం: హరీశ్రావు
హైదరాబాద్: జిల్లాలో ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరంలేదని మంత్రి హరీష్రావు అన్నారు. జిల్లా ఆసుపత్రిలో వున్న ఐసోలేషన్కు అదనంగా స్థానిక ఎంఎన్ఆర్ మెడికల్ కళాశాలలో 100 పడకల కోవిడ్ వార్డును ఈనెల 15న ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆరోగ్యంపై ఏమాత్రం అనుమానం ఉన్నా..స్థానిక పిహెచ్సిలో సంప్రదించాలని సూచించారు. ఆసుపత్రిలో వ్యాధి నిరోధకశక్తిని పెంచే అన్ని రకాల ఆహార పదార్ధాలు అందిస్తామన్నారు.