మోదీ రైతుల పొట్ట కొడుతున్నారు: వీహెచ్
ABN , First Publish Date - 2020-09-25T17:29:01+05:30 IST
కొత్త వ్యవసాయ చట్టంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల పొట్ట కొడుతున్నారని..
హైదరాబాద్: కొత్త వ్యవసాయ చట్టంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతుల పొట్ట కొడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రైతుల గురించి మాట్లాడే అర్హత బీజేపీకి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ రైతుల కోసం ఎంతో చేసిందన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ తెచ్చిన పథకాలను బీజేపీ హైజాక్ చేస్తోందని హనుమంతరావు ఆరోపించారు.