హైదరాబాద్ చేరుకున్న క్రికెటర్లు హనుమ విహారి..సిరాజ్

ABN , First Publish Date - 2021-01-21T16:21:14+05:30 IST

ఆస్ట్రేలియా టూర్‌ను ఘ‌నంగా ముగించుకోని టీమిండియా సభ్యులు ఒక్కొక్కరుగా స్వదేశానికి వస్తున్నారు. భారత్ జట్టు స‌భ్యులకు సొంత‌గ‌డ్డ‌పై ఘ‌న స్వాగ‌తం లభిస్తోంది. సిడ్నీ టెస్ట్‌ హీరో హనుమ విహారి..నాలుగో...

హైదరాబాద్ చేరుకున్న క్రికెటర్లు హనుమ విహారి..సిరాజ్

హైదరాబాద్: ఆస్ట్రేలియా టూర్‌ను ఘ‌నంగా ముగించుకొని టీమిండియా సభ్యులు ఒక్కొక్కరుగా స్వదేశానికి వస్తున్నారు. భారత్ జట్టు స‌భ్యులకు సొంత‌గ‌డ్డ‌పై ఘ‌న స్వాగ‌తం లభిస్తోంది. సిడ్నీ టెస్ట్‌ హీరో హనుమ విహారి..నాలుగో టెస్ట్‌లోని రెండో ఇన్నింగ్స్‎లో తనదైన శైలిలో బౌలింగ్ వేసి ఆస్ట్రేలియా బ్యాటింగ్‎కు చెమటలు పట్టించి..ఐదు వికెట్లు తీసిన మరో హీరో మహ్మద్‌ సిరాజ్‌లు గురువారం ఉదయం హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. క్రికెటర్లకు అభిమానులు పుష్ప గుచ్చాలను ఇచ్చి ఘన స్వాగతం పలికారు. స్వదేశీ పర్యటనలో ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్న అనంతరం సిరాజ్ ఇంగ్లాండ్‎తో జరిగే టెస్ట్ సిరీస్‎లో పాల్గొననున్నాడు.

Updated Date - 2021-01-21T16:21:14+05:30 IST