హనుమకొండలో Rao padma హౌస్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-11-16T17:25:00+05:30 IST
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్పై రాళ్ల దాడి నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మరెడ్డిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
హనుమకొండ: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కాన్వాయ్పై రాళ్ల దాడి నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మరెడ్డిని పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో పోలీసుల తీరుపై రావు పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఠం కదులుతుందనే భయంతో బండి సంజయ్పై టీఆర్ఎస్ దాడులు చేయిస్తోందని ఆరోపించారు. ఇక తెలంగాణలో మీ ఆటలు సాగవని, ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దాడులు చేస్తే బీజేపీ చూస్తూ ఉరుకోదని రావు పద్మారెడ్డి అన్నారు.