‘పట్టణ ప్రగతి’ పనులను పూర్తి చేయండి
ABN , First Publish Date - 2022-01-22T04:29:29+05:30 IST
‘పట్టణ ప్రగతి’ పనులను పూర్తి చేయండి
అధికారులకు మేయర్ సుధారాణి ఆదేశాలు
జీడబ్ల్యూఎంసీ(హనుమకొండసిటీ), జనవరి 21: పట్టణ ప్రగతి పనులను వెంటనే పరిష్కరించాలని మేయర్ గుండు సుధారాణి జీడబ్ల్యూఎంసీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష జరిపారు. పట్టణ ప్రగతిలో డివిజన్ల వారిగా 4895 విద్యుత్ దీపాల ఏర్పాటును గుర్తించినట్లు పేర్కొన్నారు. వీటిలో 4300 దీపాల ఏర్పాటు జరిగిందని, మిగతావి కూడా పూర్తి చేయాలని ఆదేశించారు. 2517 విద్యుత్స్తంభాల ఏర్పాటులో సగం మాత్రమే వేశారని, మిగతా స్తంభాలు వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. 130 హైమాస్ లైట్ల టెండర్ పూర్తియిన క్రమంలో డివిజన్లలో అమర్చాలన్నారు.
రూ.70 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్
నగరంలోని చింతగట్టు ప్రాంతంలో ఇరిగేషన్ కెనాల్ వద్ద రూ.70కోట్ల అంచనా వ్యయంతో సొలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ ప్రావీణ్య తెలిపారు. శుక్రవారం కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కునాల్కుమార్ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్లో నిర్వహించిన సెమినార్లో సొలార్ పవర్పాయింట్ ఏర్పాటు వివరాలను కమిషనర్ ప్రావీణ్య వివరించారు.